మంత్రి శ్రీధర్ బాబుకు టీఎంయూ వినతి
హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) నేతలు మంత్రి శ్రీధర్బాబుకు బుధవారం వినతిపత్రం సమర్పించారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ అయిన మంత్రి శ్రీధర్బాబు ఆర్టీసీ హామీలన్నింటినీ మ్యానిఫెస్టోలో ఉంచినందుకు టీఎంయూ నేతలు కృతజ్ఞతలు తెలిపారు.
త్వరగా తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని టీఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏఆర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి థామస్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కమలాకర్గౌడ్, యూనియన్ నేతలు యాదయ్య, ఆర్ఎన్ రెడ్డి తదితరులు కోరారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని మంత్రి తెలిపారు.