గజ్వేల్ పీఎస్లో బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు
గజ్వేల్, అక్టోబర్3: మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావును అసభ్య పదజాలంతో దూషించిన కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావుపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, మాజీ ఎఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు.. గురువారం గజ్వేల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
వారు మాట్లాడుతూ.. మీడియాలో ఫేం, అధిష్టా నం మెప్పు కోసమే మైనంపల్లి నోటికి ఏదివస్తే అది మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్య క్తం చేశారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావుపై పెట్రోలు పోసి అంటిస్తాననడం ఎంతవరకు సబబు అన్నారు. మైనంపల్లిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జకియోద్దీన్, మాజీ జెడ్పీటీసీ పంగమల్లేశం, మండల పార్టీ అధ్యక్షుడు బెండమధు, కౌన్సిలర్లు ఉప్పలమెట్టయ్య, బబ్బూరి రజిత, చందు, నాయకులు.. మద్దూరి శ్రీనివాస్రెడ్డి, దయాకర్రెడ్డి, బొల్లారం ఎల్లయ్య, గుంటుకు రాజు, ఆర్కె.శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.