calender_icon.png 4 October, 2024 | 4:56 AM

అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోండి

04-10-2024 12:42:43 AM

మున్సిపల్ అధికారులకు పుప్పాలగూడ వాసుల వినతి 

రాజేంద్రనగర్, అక్టోబర్3: అక్రమ నిర్మాణాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడ వాసులు గురువారం కమిష నర్ ప్రదీప్‌కు ఫిర్యాదు చేశారు.

పుప్పాడగూడ కాలనీలోని ఓ వీధిలో 20 ఫీట్ల రోడ్డులో కొందరు ఎలాంటి అనుమతులు లేకుండా అపార్ట్‌మెంట్ నిర్మిస్తున్నాని.. ఈ నిర్మాణం వలన స్థానికుల రాకపోకలకు ఇబ్బందిగా ఉందని కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈవిషయమై క్షేత్రస్థాయిలో పర్యటించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

బఫర్‌జోన్‌లో నిర్మాణాలు 

మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని బీరప్ప టెంపుల్ సమీపంలోని నాలాను కొందరు మట్టితో నింపి రోడ్డు వేయడంతో పాటు దానిపై షెడ్డు కూడా వేస్తున్నారని, అలాగే కొందరు స్థానికంగా బఫర్ జోన్‌లో నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు మున్సిపల్, రెవెన్యూ అధికారు లకు విజ్ఞప్తి చేశారు. కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.