calender_icon.png 11 October, 2024 | 11:47 AM

ఉప్పల్ వేదికగా 12న టీ20 మ్యాచ్

11-10-2024 01:12:40 AM

స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 10 (విజయక్రాంతి): ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ నెల 12న జరగనున్న ఇండియా, బంగ్లాదేశ్ 3వ టీ20 మ్యాచ్ సందర్భంగా స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. ఈ ఆంక్షలు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11:50 గంటల వరకు అమల్లో ఉంటాయని గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

ట్రాఫిక్ జామ్ తలెత్తకుండా ఉండడానికి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.  అలాగే స్టేడియానికి వచ్చే అభిమానులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పార్కింగ్ సదుపాయాలు చేస్తున్నామని సీపీ వెల్లడించారు.