న్యూఢిల్లీ, అక్టోబర్ 5: ‘బోల్ట్’ సర్వీసు పేరుతో10 మినిట్ ఫుడ్ డెలివరీ సర్వీసును ప్రారంభించినట్లు ఫుడ్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ స్విగ్గీ తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్తో సహా కొన్ని నగరాల్లో బోల్ట్ సర్వీసులు అమలవుతున్నాయని, వచ్చే కొద్ది వారాల్లో మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని స్విగ్గీ పేర్కొంది.
వినియోగదారుకు 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఎంపికచేసిన రెస్టారెంట్ల నుంచి స్విగ్గీ క్విక్ ఫుడ్ డెలివరీ సర్వీసు లభిస్తుంది. బర్గర్లు, వేడి, శీతల పానీయాలు, బ్రేక్ఫాస్ట్ ఐటెమ్స్తో పాటు తయారీకి తక్కువ సమయంపట్టే బిర్యానీని ఆర్డర్ చేయవచ్చు. అలాగే ఐస్క్రీమ్, స్వీట్స్, స్నాక్స్ తదితర రెడీ టూ ప్యాక్ ఐటెమ్స్ను కూడా బోల్డ్ సర్వీస్ ద్వారా డెలివరీ చేస్తామని స్విగ్గీ తెలిపింది.