calender_icon.png 23 September, 2024 | 10:54 PM

వరద బాధితులకు స్వేరోస్ సాయం

23-09-2024 12:26:03 AM

కోదాడ, సెప్టెంబర్ 22: వరద బాధితు లకు సహాయం చేయడం అభినందనీయ మని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా తొగ ర్రాయి, కూచిపూడి గ్రామాల్లో స్వేరోస్ అధ్వ ర్యంలో బాధిత కుటుంబాలకు బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేశా రు. రెండు గ్రామాల్లో 250 కుటుంబాలకు రూ.7 లక్షల విలువ చేసే సరుకులు అదించారు. తొగర్రాయి గ్రామానికి చెందిన తారా బాయికి భీమ్ హౌస్ కట్టిస్తామని హామీ ఆర్‌ఎస్పీ ఇచ్చారు. కార్యక్రమంలో బాల ప్రసాద్, చిలకబత్తిని వీరన్న, చెనుకుపల్లి కొరణ్, మచ్చా నరసయ్య, ఎలమర్తి శౌరి, కొండా భీమయ్య, ఏసుబాబు, జగన్, వీరస్వామి, నలగార్జన, లక్ష్మణ్, సునిత, కనకరావు, పద్మ, ధనమ్మ పాల్గొన్నారు.