calender_icon.png 5 October, 2024 | 2:48 PM

యాదాద్రి నృసింహుడికి ఘనంగా స్వాతి పూజలు

05-10-2024 11:06:41 AM

అష్టోత్తర శతఘటాభిషేకం 

యాదాద్రి భువనగిరి (విజయక్రాంతి ): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట లక్ష్మి నృసింహుడి సన్నిధిలో శనివారం స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి పూజలు ఘనంగా నిర్వహించారు. వేకువ జామున ఆలయ ముఖమండపం లో 108 పంచామృతాలు, నవధాన్యాలు, దివ్య ఔషాదులతో నింపి వేద మంత్రాలతో అర్చించారు. లోక కళ్యాణం కోసం హోమ పూజలు జరిపారు. 108 ఘట్టాల్లోని పంచామృత పవిత్ర జలాలతో గర్భాలయంలోని మూలవరులకు శత ఘటాభిషేకం జరిపారు. ఈ ప్రత్యేక అభిషేక పూజల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. అదే విధముగా స్వాతి పురస్కరించుకుని యాదాద్రి కొండ చుట్టూ గిరిప్రదక్షిణలో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు