calender_icon.png 5 October, 2024 | 8:59 PM

పుల్లూరు లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంలో ఘనంగా స్వాతి నక్షత్ర ఉత్సవం

05-10-2024 05:08:58 PM

నవ కళశ అభిషేకం.. సుదర్శన నరసింహ హోమంలో పాల్గొన్న భక్తులు

సిద్దిపేట (విజయక్రాంతి):  సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు బండపై గల స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంలో శనివారం స్వాతి నక్షత్ర ఉత్సవం ఘనంగా నిర్వహించారు. నరసింహ స్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున ప్రతినెలా పుల్లూరు స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంలో స్వాతి నక్షత్ర ఉత్సవం ఘనంగా జరుగుతుందని అందులో భాగంగా పుల్లూరు బండపై ముందుగా స్వయంభూ నరసింహ స్వామి మూర్తికి దేవాలయ వంశ పారంపర్య అర్చకులు కలకుంట్ల రంగా చార్య, పొడిచేటి రామకృష్ణమా చార్య, విజయ్, జయంత్ సాయి, కలకుంట్ల నచికేతల ఆధ్వర్యంలో పంచామృతాలతో నవకళష అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం దేవాలయ ఆవరణలో సుదర్శన నరసింహ హోమం వైభవంగా వేదమంత్రాల మధ్య నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పుల్లూరు గ్రామ మాజీ సర్పంచ్ గడ్డం తిరుపతిరెడ్డి, ఒగ్గు మురళి, గ్రామ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.