calender_icon.png 24 September, 2024 | 2:03 PM

తిరుపతిలో ఆందోళన చేస్తున్న స్వామీజీలు

24-09-2024 11:39:29 AM

తిరుమల,(విజయక్రాంతి): తిరుపతిలో పలువురు స్వామీజీలు ఆందోళన చేస్తున్నారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ఎదుట ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సాధు పరిషత్ ఆధ్వర్యంలో స్వామీజీలు నిరసనకు దిగారు. సేవ్ తిరుమల.. సేవ్ టీటీడీ అంటూ ప్లకార్డులు పట్టుకోని నినాదాలు చేస్తున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయాల్లో అన్యమతస్థులను ఉద్యోగులుగా నియమించవద్దని డిమాండి చేశారు. టీటీడీ ఈవోకు వినతిపత్రం ఇచ్చేందుకు భారీగా వచ్చిన స్వామీజీలు దేవాలయాన్ని అపవిత్రం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.