కల్వకుర్తి, జనవరి 28: రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ రూల్స్ పాటించా లని సూచిస్తూ కల్వకుర్తి పట్టణానికి చెందిన స్వామివివేకానంద సేవా బందం ,మై భారత్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.
బుధవారం ప్రభు త్వ జూనియర్ కళాశాలలో 15 మంది స్వచ్ఛంద ట్రాఫిక్ వాలంటర్స్ ను ఎంపిక చేసి టి షర్ట్స్, క్యాప్స్ పంపిణి చేస్తూ ట్రాఫిక్ రూల్స్ పై ర్యాలీ నిర్వహించి వాహన దారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వివేకానంద సేవ బందం అధ్యక్షుడు శివ కుమార్, దుర్గా ప్రసాద్, నర్సింహ, సేవ బందం సభ్యులు లక్ష్మి నరసింహ, అజయ్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.