హైదరాబాద్సిటీబ్యూరో, అక్టోబర్ 4(విజయక్రాంతి): విధుల్లో నిర్లక్ష్యం వహించిన వి.పీక్లాల్, పి.వెంకట్రెడ్డి అనే ఉపాధ్యాయులను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శుక్రవారం సస్పెండ్ చేశారు. బండ్లగూడ-2 మండలం చంద్రికపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఎస్జీటీలుగా విధులు నిర్వహిస్తున్న పీక్లాల్, వెంకట్రెడ్డి..
విద్యార్థుల హాజరును ఎఫ్ఆర్ఎస్లో నమోదు చేయకపోవడం, రికార్డు నిర్వహణలో నిర్లక్ష్యం వహించారంటై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణ అనంతరం అధికారులు కలెక్టర్కు అందించిన నివేదిక ఆధారంగా వారిద్దరిని సస్పెం డ్ చేసినట్లు తెలుస్తోంది.
కొంత కాలంగా ప్రభుత్వ పాఠశాలల్లోని పరిస్థితులను పర్యవేక్షించేందుకు కలెక్టర్ ప్రత్యేకాధికారులను నియమించారు. వారు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎప్పటికప్పుడు కలెక్టరేట్కు నివేదిక లు అందజేస్తున్నట్లు సమాచారం.
ఏర్పాట్ల పరిశీలన..
డిప్యూటీకలెక్టర్లు, స్పెషల్ కలెక్టర్లతో ఆదివారం మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహిం చనున్నారు. ఈ సందర్భంగా సమావేశం జరగబోయే జూబ్లీహిల్స్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలోని దాశరధి మీటింగ్ హాల్లో ఏర్పాట్లను కలెక్టర్ అనుదీప్ పరిశీలించారు. అదనపు కలెక్టర్ వెంకటాచారి, ఆర్డీవో దశరథ్సింగ్, హెచ్ఆర్డీ ఏవో నిర్మల పాల్గొన్నారు.