calender_icon.png 27 September, 2024 | 10:51 PM

ఇద్దరు టీచర్ల సప్పెన్షన్

27-09-2024 01:11:05 AM

‘క్రిప్టో’ కేసులో అరెస్టు ఫలితం

నిర్మల్, సెప్టెంబర్ 2౬(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో సంచలనం సృష్టించిన క్రిప్టో బిట్ కాయిన్ వ్యాపారంతో సంబంధం ఉండి అరె స్టు అయిన ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యా ధికారి రవీందర్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో ఎస్జీ టీలు దాసరి రమేష్(కడెం మండలం కన్నపూర్ ఎంపీపీఎస్), వెంకటేష్‌గౌడ్(కుబీర్ మండలం దావుజీనాయక్ తండా) ఉన్నారు.