calender_icon.png 17 October, 2024 | 4:57 AM

టీఎస్‌ఎండీసీ ఎండీగా సుశీల్‌కుమార్

17-10-2024 12:55:18 AM

ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ శాంతికుమారి

హైదరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా సుశీల్‌కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సుశీల్ కుమార్ ప్రస్తుతం మైన్స్ అండ్ జియోలజీ శాఖ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

టీఎస్‌ఎండీసీ ఎండీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తూ రిలీవ్ అయిన జీ మల్సూర్ స్థానంలో నియమితులైన సుశీల్‌కుమార్ రెండేళ్లపాటు లేదా తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు గానీ ఈ బాధ్యతల్లో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు