calender_icon.png 12 October, 2024 | 8:51 AM

సూర్యవంశీ అదుర్స్

01-10-2024 12:00:00 AM

చెన్నై: ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరుగుతున్న అనధికారిక టెస్టులో భారత జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 107 పరుగులు చేసిం ది. వైభవ్ సూర్యవంశీ (81 నాటౌట్) వేగంగా ఆడుతుండగా.. విహాన్ మల్హోత్రా (21 నాటౌట్) అతడికి సహకరిస్తున్నాడు.

భారత్ ఇంకా 190 పరుగులు వెనుకబడి ఉంది. అంతకముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 293 పరుగులకు ఆలౌటైంది. కాన్నర్ (61) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో నాగరాజ్, మొహ్మద్ ఎన్నన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.