భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 1(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట మంగళవారం మావోయిస్టు దళ సభ్యుడు మడకం ఇడుమయ్య అలియాస్ మహేశ్ లొంగిపోయినట్టు ఎస్పీ రోహిత్రాజు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం అడవిరామవరం గ్రామానికి చెందిన మహేశ్ ఏటూరునాగా రం ఏరియా కమిటీ దళసభ్యుడిగా పనిచేస్తున్నాడు.
అత డు 15 సంవత్సరాల క్రితం చతీస్గఢ్ నుంచి అడవిరామవరంకు వలస వచ్చాడు. 3వ తరగతి వరకు అక్కడే చదువుకున్నాడు. చాలా సంత్సరాలపాటు వ్యవసాయ కూలీగా పనిచేశా డు. 2023 జనవరి 30న సోదరుడైన పూనెం ఇడుమయ్యతో కలిసి టీఎస్సీఎం దామోదర్ సమక్షంలో మావోయిస్టు పార్టీలో సభ్యుడిగా చేరాడు. అతడికి ఎస్పీ ఆర్థిక సాయం అందజేశారు.