calender_icon.png 20 October, 2024 | 2:50 AM

ముగ్గురు మావోయిస్టుల లొంగుబాటు

20-10-2024 12:45:31 AM

భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 19 (విజయక్రాంతి): మావోయిస్టు పార్టీ చర్ల ఏరియాకు చెందిన ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు, ఒక దళ సభ్యుడు శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు, 141 బెటాలియన్ సీఆర్‌పీఎఫ్ అధికారుల ఎదుట లొంగిపోయారు. వారి వివరాలను ఎస్పీ రోహిత్‌రాజు వెల్లడించారు.  చతీస్‌గఢ్‌కు చెందిన పొడియం మంగు అలియాస్ దేవేందర్ (ఏరియా కమిటీ సభ్యుడు), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొరకట్‌పాడు గ్రామానికి చెందిన మడివి అడిమే అలియాస్ అనూష (ఏరియా కమిటీ సభ్యురాలు), ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లగుప్ప గ్రామానికి చెందిన కుడం సోమల్ (దళసభ్యుడు) ఉన్నారు. ఒక్కొక్కరికి రూ.4 లక్షల రివార్డు ఉన్నదని ఎస్పీ తెలిపారు. వారికి జీవనోపాధి, పునరావాసం కల్పించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం కృషి చేస్తుందని ఎస్పీ హామీ ఇచ్చారు.