న్యూఢిల్లీ: అక్రమ వలసలను పరిష్కరించడానికి ఉద్దేశించిన అస్సాం ఒప్పందంలోని నిబంధనలను ధృవీకరిస్తూ, పౌరసత్వ చట్టం, 1955లోని సెక్షన్ 6A రాజ్యాంగ చెల్లుబాటును సుప్రీంకోర్టు గురువారం 4:1 మెజారిటీతో సమర్థించింది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు సూర్యకాంత్, ఎంఎం సుందరేష్, జెబి పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.
సెక్షన్ 6A రాజ్యాంగ విరుద్ధమని జస్టిస్ పార్దివాలా భిన్నాభిప్రాయాలతో కూడిన తీర్పు ఇచ్చారు. 1966 జనవరి నుంచి 1971 మార్చి 25లోపు అసోంకు వచ్చిన వలసదారులకు పౌరసత్వం ఇచ్చారు. బంగ్లాదేశ్ వలసలపై ఉద్యమించినవారితో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ జస్టిస్ పార్థీవాలా అభిప్రాయం వ్యక్తం చేశారు. సీజేఐ డీవై చంద్రచూడ్ తన తీర్పులో అసోం ఒప్పందం అక్రమ వలసల సమస్యకు రాజకీయ పరిష్కారమని, సెక్షన్ 6ఏ శాసనపరమైన పరిష్కారమని అన్నారు. ఈ నిబంధనను రూపొందించడానికి పార్లమెంటుకు శాసనపరమైన సామర్థ్యం ఉందని మెజారిటీ అభిప్రాయపడింది. స్థానిక జనాభాను రక్షించాల్సిన అవసరంతో మానవతా ఆందోళనలను సమతుల్యం చేయడానికి సెక్షన్ 6A అమలు చేయబడిందని మెజారిటీ అభిప్రాయపడింది.