న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. పరీక్షలకు సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కూడా త్రిసభ్య ధర్మాసనం నిరాకరించింది. హైకోర్టు తన మధ్యంతర ఉత్తర్వుల్లో అన్ని అంశాలూ స్పష్టంగా చెప్పిందని సీజేఐ తెలిపారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాల్లో ఉన్నప్పుడు జోక్యం చేసుకోవడం సరికాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఫలితాల విడుదల ముందే తుది విచారణ ముగించాలని హైకోర్టుకు సూచించింది.