calender_icon.png 23 October, 2024 | 10:58 AM

నీట్-యూజీ అంశంపై విచారణ వాయిదా

11-07-2024 01:55:56 PM

న్యూఢిల్లీ: నీట్- యూజీ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. నీట్-యూజీ 2024 పరీక్షను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. తదుపరి విచారణ ఈనెల 18కి వాయిదా వేసింది. కేంద్రం, ఎన్టీఏ నుంచి అఫిడవిట్లు అందలేదని సర్వోన్నతన్యాయస్థానం పేర్కొంది. అఫిడవిట్లు అందాకే వాదనలు వింటామని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.