అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్రెడ్డి
కరీంనగర్, అక్టోబరు 19 (విజయక్రాంతి): పట్టభద్రుల ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పాటు అందిస్తానని, వారికి ఉద్యోగ కల్పనే ధ్యేయంగా పనిచేస్తానని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్రెడ్డి అన్నారు. శనివారం కరీంనగర్లోని పలు పాఠశాలలు, కళాశాలలను సందర్శించి మాట్లాడారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. ప్రైవేట్ యాజామాన్యాలతో మాట్లాడి ఉపాధ్యాయులకు హెల్త్కార్డులను జారీ చేయడానికి కృషి చేస్తానన్నారు. పోటీ పరీక్షల ఆశావహుల సౌకర్యార్థమై దీపావళి పర్వదినాన ప్రత్యేక యాప్ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.