calender_icon.png 20 October, 2024 | 2:56 AM

కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర

20-10-2024 12:42:05 AM

ఎమ్మెల్యేలు వీరేశం, మదన్‌మోహన్‌రావు

నల్లగొండ/కామారెడ్డి, అక్టోబర్ 19 (విజయక్రాంతి): ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని ధర్మారెడ్డి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మదన్‌మో హన్‌రావు ప్రారంభించారు.

కార్యక్రమంలో ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రజితావెంకట్‌రాంరెడ్డి పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌తో కలిసి ఎమ్మెల్యే వేముల వీరేశం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు.