సీపీఐ నేతల డిమాండ్, ధర్నా
నిర్మల్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): భైంసా మండలంలోని పల్సిరంగారావు ప్రాజెక్టులో ముంపునకు గురైన గుండేగాం గ్రామ బాధితులను ఆదుకుని, పునరావాస ప్రక్రియను పూర్తిచేయాలని సీపీఐ నాయకులు కోరారు. బుధవారం గ్రామస్థులతో కలిసి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. గ్రామం పదేండ్ల క్రితం ముంపునకు గురైనా ఇప్పటివరకు పరిహారం, ఇండ్లు, పునరావాసం కల్పించేందుకు నిధులు మంజూరు చేయకపోవడం తగదన్నారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు హామీలు ఇచ్చి విస్మరించారని తెలిపారు. రెండు వందల కుటుంబాల పునరావాసం కోసం ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు భూమయ్య, విలాస్, నాయకులు లక్ష్మణ్, రమేష్ పాల్గొన్నారు.