calender_icon.png 20 April, 2025 | 1:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పొద్దు తిరుగుడు పువ్వు కొనుగోలు కేంద్రం ప్రారంభం

10-04-2025 03:11:14 PM

మద్నూర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా  డోంగ్లీ మండలం మొఘా గ్రామంలో జుక్కల్ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు  ఆదేశాల మేరకు గురువారం  పొద్దు తిరుగుడు పువ్వు గింజల కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసి వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రభుత్వ మద్దతు ధర క్వింటల్ కు రూ. 7,280 చెల్లిస్తుందని తెలిపారు, రైతులందరు పొద్దు తిరుగుడు గింజలను మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో  అమ్ముకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో వ్యవసాయ అధికారి శివ ఏఈఓ విశాల్   సోసైటీ చైర్మన్ రామ్ పటేల్ మాజీ ఎంపిటిసి హన్మంత్ పటేల్ మాజీ ఉప సర్పంచ్ నాగనాథ్ సంగ్రామ్ పటేల్, మల్లు గోండా, సుధాకర్ గౌడ్,రైతులు  తదితరులు పాల్గొన్నారు.