calender_icon.png 28 October, 2024 | 10:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేర్వేరు చోట్ల ఇద్దరు యువకుల ఆత్మహత్య

14-09-2024 12:34:24 AM

కామారెడ్డి,సెప్టెంబర్ 13(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో వేర్వేరు చోట్ల ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకొన్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. పిట్లం మండలం తిమ్మానగర్‌కు చెందిన బొల్లారం నాందేవ్ (23) జులాయిగా తిరుగుతుండ టంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో గురువారం ఇంటి నుంచి వెళ్లిన నాందేవ్ శుక్రవారం పిట్లం శివారులో చెట్టుకు ఉరివేసుకొన్నట్టు గుర్తించారు.

మరో ఘటనలో గాంధారి మండలంపెద్ద పొలంగల్ శివారులోని బుగ్గ రామేశ్వర లింగం ఆలయం సమీపంలో సంగారెడ్డి  జిల్లా సిద్దాపూర్ మండలం ఖాజాపూర్‌కు చెందిన చాకలి వెంకటి (26) ఉరేసుకున్నా డు. భార్యతో గొడవపడి గాంధారిలో ఉన్న చెల్లె ఇంటికి వెళ్తున్నానని చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.