calender_icon.png 21 October, 2024 | 4:20 PM

మరో నేత కార్మికుడి ఆత్మహత్యl

21-10-2024 12:09:20 AM

ఆర్థిక ఇబ్బందులే కారణం

సిరిసిల్ల, అక్టోబర్ 20: ఆర్థిక ఇబ్బందులు తాళలేక నేతకార్మికుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సిరిసిల్ల పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. బీవై నగర్‌కు చెందిన ఆడెపు సంపత్(60) నేత కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నాలుగు నెలలుగా వస్త్ర పరిశ్రమ మూతపడటం, చేతినిండా పనులు లేకపోవడం, అప్పులు వారి ఇబ్బందులు, దీనికితోడు అనారోగ్య సమస్యలు ఉండటంతో తీవ్ర మనోవేదనకు గురైన సంపత్ ఆదివారం తెల్లవారుజామును ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

భార్య భాగ్య తన కూతురు కవితకు పురుడు పోసేందుకు వెళ్లగా, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో సంపత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెల్లవారినా ఇంటి తలుపులు తీయకపోవడంతో కొడుకులు తలుపులు బద్దలు కొట్టి చూసేసరికి విగతజీవిగా కనిపించాడు.