calender_icon.png 28 October, 2024 | 3:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక ఇబ్బందులతో యువకుని ఆత్మహత్య

28-10-2024 01:39:31 PM

కామారెడ్డి జిల్లా దాల్ మల్కపల్లిలో ఘటన

కామారెడ్డి, (విజయక్రాంతి): ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం దాల్ మల్కపల్లిలో చోటుచేసుకుంది. స్థానికులు పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్లారెడ్డి మండలం దాల్ మల్కాపల్లి గ్రామానికి చెందిన నేరేడుపల్లి సతీష్ (28) ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆదివారం రాత్రి గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సతీష్ స్వగ్రామం నిజాంసాగర్ మండలం నర్వ గ్రామం కాగా  సతీష్ ఎల్లారెడ్డి మండలం దాల్ మల్కపల్లకి ఇల్లరికం వచ్చాడు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. అప్పులు ఇచ్చినవారు ఒత్తిడి చేయడంతో కలత చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్లారెడ్డి పోలీసులు తెలిపారు.