న్యూఢిల్లీ, అక్టోబర్ 17: ఇండియన్ మిలిటరీలో పనిచేస్తున్న దంపతులు ఒకేరోజు సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. కాగా ఈ దంపతులు వేర్వేరు నగరాల్లో ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం. ఆగ్రాలోని ఎయిర్ఫోర్స్ స్టేషన్లో దీన్దయాళ్ దీప్ (32) ఐఏఎఫ్ ఫ్లుటై లెఫ్టినెంట్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆగ్రాలోని సైనిక ఆస్పత్రిలో దీప్ భార్య రేణు తన్వర్ ఆర్మీలో కెప్టెన్గా పనిచేస్తుంది. కాగా తన్వర్ తల్లి, సోదరుడికి ట్రీట్మెంట్ చేయించాడానికి ఢిలీకి వెళ్లింది. ఇంతలోనే భార్యభర్తలిద్దరూ అనుమానాస్పదంగా సూసైడ్ చేసుకున్నారు. రాత్రి భోజనం చేసిన తర్వాత గదిలోకి వెళ్లిన దీప్ ఉరేసుకొని చనిపోయాడు. అదే రోజు రాత్రి తన్వర్ ఢిల్లీ కంటోన్మెంట్లోని అధికారుల మెస్ హాల్లో ఆత్మహత్యకు పాల్పడింది.