కుటుంబ కలహాలే కారణం
జగదేవ్పూర్, జూలై 10: పురుగు మందు తాగి దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జగదేవ్పూర్ మండలంలోని ఇటిక్యాల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసు ల కథనం ప్రకారం.. ఇటిక్యాలకు చెందిన కరకపట్ల శేఖర్ (36)కు మండలంలోని దౌలాపూర్ గ్రామానికి చెందిన సౌమ్య(27) తో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఐదేండ్లు సాఫీగా సాగిన కాపురంలో గతేడాది నుంచి తరచూ కలహాలు తలెత్తగా, పెద్దలు సర్దిచెప్పడంతో కలిసిపోయారు. శేఖర్ కుటుంబ సభ్యులతో కలిసి తుర్కపల్లిలో ఉంటూ మామిడి తోటలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు.
మళ్లీ కలహాలు రావడంతో తీవ్ర మనస్థాపానికి గురైన దంపతులు స్వగ్రామమైన ఇటిక్యాలకు వచ్చి మంగళవారం అర్ధరాత్రి తమ పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. సమాచారం తెలుసుకున్న స్థానికులు 108కి ఫోన్ చేయగా, వారిని చికిత్స నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలిస్తున్న క్రమంలో మార్గం మధ్యలోనే సౌమ్య మృతిచెందగా, చికిత్సపొందుతూ శేఖర్ బుధవారం మృతిచెందారు. సౌమ్య తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు.