calender_icon.png 1 October, 2024 | 2:52 PM

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి ఆత్మహత్యాయత్నం

01-10-2024 02:17:14 AM

ఒకరి పర్థిసితి విషమం.. ఉస్మానియాలో చికిత్స 

ఆర్థిక ఇబ్బందులే కరాణం!

సరూర్‌నగర్‌లోని కోదండ రామ్‌నగర్ కాలనీలో ఘటన

ఎల్బీనగర్, సెస్టెంబర్ 30: ఆర్థిక ఇబ్బందులు ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశా యి. తల్ల్లిదండ్రులు సహా ముగ్గురు కుమారులు విషం సేవించి ఆత్మాహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సరూర్‌నగర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు... సరూర్‌నగర్‌లోని కోదండరామ్‌కాలనీలో ఉలుచాల వెంకటేశ్వరప్రసాద్ (60), భార్య లత(55) నివాసం ఉంటున్నారు.

వీరికి ముగ్గురు కుమారులు. సందీప్ (30) సాప్ట్‌వేర్ ఉద్యోగి, సాయి స్వరూప్ (28) కిరాణా షాప్ నిర్వహిస్తున్నాడు, వంశీకృష్ణ(26) బీటెక్ పూర్తి చేసి ఉద్యోగాన్వే షణలో ఉన్నాడు. వీరందరూ ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంతో సోమవారం ఐదుగురు ఇంట్లోనే గుర్తుతెలియని విషం సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

స్థానికులు గమనించి, పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారందిరిని ఉస్మానియా దవాఖానకు తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమం గా ఉండగా.. నలుగురు చికిత్స పొందుతున్నారు. వీరి ఆత్మహత్యాయత్నానికి పూర్తి కారణాలు తెలియాల్సి ఉన్నది.