మెడికల్ టెస్టులో ఫెయిలైనందుకు..
నిజామాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లాలనుకున్న యువకుడికి నిర్వహించిన మెడికల్ టెస్టులో అనర్హుడని రావడంతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండల అభంగపట్నం గ్రామానికి చెందిన అల్లె వినోద్కుమార్(30) ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లాలని నిర్ణయించుకుని అప్పు చేసి ఏజెంట్కు డబ్బు లు చెల్లించాడు. వీసా కోసం మెడికల్ టెస్ట్ నిర్వహించగా వినోద్కుమార్ అనర్హుడని తేలింది. డబ్బులు తిరి గి ఇచ్చేందుకు ఏజెం ట్ నిరాకరించడంతో అప్పు తీర్చే మార్గంలేక మనస్థాపానికి గురయ్యాడు. నవిపేట్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి శుక్రవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు.