calender_icon.png 29 September, 2024 | 4:53 PM

పోటీ చేస్తా: సుగుణకర్ రావు

29-09-2024 02:30:47 PM

కరీంనగర్,(విజయక్రాంతి): రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తానని బీజేపీ కిసాన్ సెల్ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్ రావు వెల్లడించారు. ఈ సందర్భంగా సుగుణాకర్ రావు మాట్లాడుతూ... బీజేపీ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తుందనే నమ్మకం ఉందన్నారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ మాదిరిగా నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. కాంగ్రెస్ పాలనలో అజమాయిషీ లేకుండా పోయిందని హైడ్రా పులి మీద సవారీలా మారిందని వ్యాఖ్యానించారు. నిరుద్యోగులు తీవ్ర ఆవేదనతో ఉన్నారని, కార్యకర్తలతో పాటు నిరుద్యోగ యువత ఆదరణతో గెలుస్తాననే నమ్మకం తనకి ఉందని ఆయన పేర్కొన్నారుఎమ్మెల్సీ గా ఎన్నికైతే  నిరుద్యోగ యువతకు గర్జించే గొంతుకనవుతానంటూ  సుగుణాకర్ రావు చెప్పారు.