calender_icon.png 12 October, 2024 | 3:20 AM

ఆవేదనకు గురయ్యా

10-10-2024 12:00:00 AM

‘యానిమల్‘ చిత్రంతో మంచి ఫేమ్ సొంతం చేసుకున్న నటి త్రిప్తి డిమ్రి. ఈ ముద్దుగుమ్మకు ‘యానిమల్‘ తర్వాత అవకాశాలకు కొదువ లేకుండా పోయింది. అయితే ఈ సినిమా కారణంగానే ఆమె కొన్ని సమస్యల్లో చిక్కుకుంది. యానిమల్ చిత్రంలో జోయాగా నటించినందుకు తనను సామాజిక మాధ్యమాల వేదికగా పలువురు అసభ్యంగా ట్రోల్ చేశారని ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేసింది.

అలాంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఏనాడూ ఊహించలేదని, వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలియలేదని పేర్కొంది. మానసికంగా ఎంతో ఆవేదనకు గురయ్యానని, మూడు రోజుల పాటు ఏడుస్తూనే ఉన్నానని తెలిపింది. తన సోదరి తనకు ఎంతో మద్దతుగా నిలిచిందని ఆమె కారణంగానే ఆ బాధ నుంచి బయటకు వచ్చానని తెలిపింది. ప్రస్తుతం త్రిప్తి ‘భూల్ భూలయ్యా 3’, ‘ధడక్ 2’, ‘విక్కీ విద్య కా ఓ వాలా వీడియో’ చిత్రాల్లో నటిస్తోంది.