calender_icon.png 29 October, 2024 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుధీర్‌బాబు పాన్ ఇండియా చిత్రం

02-07-2024 12:05:00 AM

కెరీర్లోనే భారీ నిర్మాణ వ్యయంతో రూపొందిన ‘హరోం హరం’ సినిమాతో కొద్ది రోజుల క్రితం థియేటర్లలోకి వచ్చిన సుధీర్ బాబు, ప్రస్తుతం తర్వాతి సినిమా కోసం సన్నద్ధమవుతున్నారు.  పాన్ ఇండియా చిత్రంగా రానున్న ఈ సినిమాతో వెంకట్ కళ్యాణ్ దర్శకుడిగా పరిచయం కానున్నారు.  సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఓ బాలీవుడ్ కథానాయిక నటించనుంది. బాలీవుడ్‌లో ‘రుస్తుం’, ‘టాయ్‌లెట్: ఏక్ ప్రేమ్ కథ’, ‘ప్యాడ్ మ్యాన్’, ‘పరి’ వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన ప్రేరణ అరోరా సమర్పణలో రానున్న ఈ సినిమాకి శివిన్ నారగ్, నిఖిల్ నంద, ఉజ్వల్ ఆనంద్ నిర్మాత లుగా వ్యవహరిస్తున్నారు.

పురాణ గాథతో ముడిపడిన కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాని వచ్చే ఏడాది శివరాత్రి సందర్భంగా మార్చిలో విడుదల చేయనున్నట్టు నిర్మాణ వర్గాలు తెలిపాయి. తన ఈ తాజా చిత్రం గురించి సుధీర్ బాబు మాట్లాడుతూ “స్క్రిప్ట్ నచ్చి ఏడాది నుంచి ఈ టీమ్‌తో ట్రావెల్ అవుతున్నాను. వినూత్న కథాంశంతో రూపొందనున్న ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు ఎప్పుడెప్పుడు వద్దామా అని ఆతృతగా ఎదురుచూస్తున్నాను. వరల్డ్ క్లాస్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ప్రేక్షకులకు అందించటానికి ప్రేరణ అరోరా, ఆమె టీమ్ ఎంత గానో కష్టపడుతున్నారు” అని తెలిపారు.