హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని కేర్ ఆసుపత్రి మలక్పేట్ బ్రాంచ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కృష్ణమూర్తి సూచించారు. నర్సయ్య(65) అనే వృద్ధుడికి మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స తర్వాత కూడా నొప్పి ఉండటంతో సంవత్సరాల తరబడి ఇత ర ఆసుపత్రులకు తిరిగి.. ఇటీవల కేర్ హాస్పిటల్(మలక్పేట్)కు వచ్చాడు.
అతని కండీషన్ను తెలుసుకున్న ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రేపాకుల కార్తీక్ నేతృత్వంలోని వైద్య బృందం రెండు దశల్లో శస్త్రచికిత్సను నిర్వహించారు. ఇప్పుడు నర్సయ్య పూర్తిగా కోలుకుని తన కాళ్లపై తాను నడుస్తున్నాడని వైద్యులు తెలిపారు.