సీఎం రేవంత్ రెడ్డికి టీపీఎఫ్, ఎన్ఈసీసీ సభ్యుల వినతి
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 28 (విజయక్రాంతి): తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్, హైదరాబాద్ జోన్ నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రస్తుతం రాష్ట్రంలో కోళ్లకు అందించే ఫుడ్(దాణా) ధరలు పెరగడం వలన కోళ్ల పరిశ్రమలు దయనీయ స్థితిలో ఉన్నాయని, పెంచిన దాణా ధరలకు సబ్సిడీ కల్పించాలని సీఎంకు వినతి పత్రం అందించి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీపీఎఫ్ ప్రెసిడెంట్ కాసర్ల మోహన్రెడ్డి, జనరల్ సెక్రటరీ ఉడతల భాస్కర్రావు, వైస్ ప్రెసిడెంట్ ఉప్పల నరసింహారెడ్డి, చైర్మన్ గుర్రం చంద్రశేఖర్ రెడ్డి, వైస్ చైర్మన్ వంగేటి బాలకృష్ణా రెడ్డి, ఈసీ మెంబర్ జక్క సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.