19-02-2025 12:16:07 AM
బాన్సువాడ, ఫిబ్రవరి 18 (విజయ క్రాంతి) : కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ లోని ఓ ప్రభుత్వ పాఠశాల లో మంగళవారం బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్ మై ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజనం తయారు చేసేటప్పుడు శుభ్రత పాటించాలని సిబ్బందికి సబ్ కలెక్టర్ సూచించారు. పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో హెచ్ఎం వెంకటేశం, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.