05-03-2025 12:00:00 AM
మునుపల్లి, మార్చి 4: పదో తరగతి విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని మండల విద్యాధి కారి భీమ్ సింగ్ తెలిపారు. మంగళవారం మునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాల లో చదువుకుంటున్న విద్యార్థులకు గంధం సరస్వతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్స్ పరీక్ష సామాగ్రిని అందజేశారు.
పదో తరగతి పరీక్షల్లో ఎలాంటి ఒత్తిడి గురి కాకుండా విద్యార్థులు చదువుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గంధం సరస్వతి ఫౌండే షన్ చైర్మన్ మల్లికార్జున్, ప్రధానోపాధ్యా యురాలు మాధవి, ఉపాధ్యాయులు కల్పన ఉషాశ్రీ శ్రీవిద్య స్వరూప రాణి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.