calender_icon.png 23 October, 2024 | 4:02 PM

విద్యార్థులకు మెనూ ప్రకారం మంచి భోజనం అందించాలి

18-09-2024 03:24:00 PM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్

కామారెడ్డి (విజయక్రాంతి): విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెను ప్రకారం మంచి భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘవన్ అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. గురుకులంలోని తరగతి గదులు డార్మెంటరీ వంటశాల స్టోర్ రూములను పరిశీలించారు.

విద్యార్థినిలతో మాట్లాడుతూ మంచి విద్యను అభ్యర్థించాలని త్రిబుల్ ఐటీ లో సీటు సాధించే విధంగా విద్యను అభ్యర్థించాలని సూచించారు. భోజనం ఎలా ఉంది విద్య బోధన ఎలా ఉంది అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు అనుమతి లేకుండా విద్యార్థినీలు బయటకు వెళ్తున్నారా అని అడిగారు విద్యార్థులకు మెనూ ప్రకారం మంచి భోజనం అందించాలని ప్రిన్సిపాల్ కు సూచించారు కలెక్టర్ వెంట ఆర్డిఓ తెలంగాణ రావు జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి రజిత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్ ప్రిన్సిపల్ వనిత తాసిల్దార్ జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.