28-02-2025 06:51:34 PM
ఎంఈఓ పోచయ్య..
బెల్లంపల్లి: విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకొని భవిష్యత్తులో పైకి ఎదగాలని బెల్లంపల్లి ఇన్చార్జి ఎంఈఓ జాడి శుక్రవారం బెల్లంపల్లి ప్రభుత్వ బాలికల హైస్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి విద్యార్థి చిన్నతనం నుండే సైన్స్ పట్ల మక్కువ పెంచుకొని భావితరాలకు చక్కని ఆవిష్కరణలను అందించాలని సూచించారు. అనంతరం విద్యార్థులు తయారుచేసిన సైన్స్ మోడల్స్ ను పరిశీలించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి హెచ్ఎం విజయలక్ష్మి, సైన్స్ ఉపాధ్యాయులు మేరీ సుజాత, సుమన్, ఉపాధ్యాయులు రవి, శిరీష, ఫిజికల్ డైరెక్టర్ బండి రవి తదితరులు పాల్గొన్నారు.