వరంగల్: హనుమకొండ కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. కేయూలోని రాణిరుద్రమదేవి హాస్టల్ ను రిజిస్ట్రార్ మల్లారెడ్డి పరిశీలించారు. హాస్టల్ కు వచ్చిన కేయూ రిజిస్ట్రార్ మల్లారెడ్డిని విద్యార్థులు అడ్డుకున్నారు. నిన్న కేయూ హాస్టల్ లోని ఓ గదిలో పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. పెచ్చులు పడినప్పుడు విద్యార్థులు లేకపోవడంతో ప్రమాదం తప్పిందని విద్యార్థులు వెల్లడించారు. హాస్టళ్లను ఎవరూ పట్టించుకోవటం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రార్ గో బ్యాక్ అంటూ విద్యార్థి సంఘాలు నినాదాలు చేశారు. కేయూ రిజిస్ట్రార్ తో విద్యార్థి సంఘాల నేతలు వాగ్వాదానికి దిగారు.