calender_icon.png 23 October, 2024 | 7:54 PM

విద్యార్థి ఆత్మహత్య

23-10-2024 12:02:01 AM

మేడ్చల్, అక్టోబర్ 22: బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మేడ్చల్‌లో చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన సిద్ధార్థ యాదవ్ (18) కిష్టాపూర్‌లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశా లలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతూ మేడ్చల్‌లోని ప్రైవేటు హాస్టల్ లో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. మంగళవారం తాను హాస్టల్‌లోనే ఉంటానని చెప్పడంతో స్నేహితులు కాలేజీకి వెళ్లిపోయారు.

సాయంత్రం వారు వచ్చేసరికి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహ త్యకు ఎవరూ కారకులు కాదని ఫోన్‌లో తన కు తానే పంపుకొన్నాడు. కాగా అతడి ఫోన్‌లో ఆన్‌లైన్ గేమ్‌కు సంబంధించిన యాప్స్ ఉన్నాయి. ఆ కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.