calender_icon.png 29 September, 2024 | 2:57 AM

విద్యార్థిని ఆత్మహ త్య

28-09-2024 01:58:03 AM

పటాన్‌చెరు, సెప్టెంబర్ 27: పటాన్‌చెరులోని గీతం యూనివర్సిటీలో విషాదం చోటు చేసుకుంది. వర్సిటీ హాస్టల్‌లో ఉంటూ బీటెక్ విద్యార్థిని.. హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన నాగల్లి వర్ష (19).. వర్సిటీలో బీటెక్ సెకెండ్ ఇయర్ చదువుతూ.. అదే కళాశాల హాస్టల్‌లో ఉంటోంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం కళాశాలకు వచ్చిన వర్ష వెంటనే హాస్టల్‌కు వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. యాజమాన్యం ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి సీఐ ప్రవీణ్‌రెడ్డి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.