కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): రాష్ట్ర స్థాయి ఎస్ జి ఎఫ్ అండర్ 19 కబడ్డీ పోటీలకు జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల/కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న చుంచు వంశీకృష్ణ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. ప్రతిభ కనబరిచి విద్యార్థి మహబూబ్ నగర్ జిల్లాలో నవంబర్ 2 నుండి 4 తేదీ వరకు జరిగే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొననున్నారు. ఎంపికైనా వంశీకృష్ణను కళాశాల ప్రిన్సిపాల్ జూలురు యాదగిరి, ఎస్ వి పి అబ్దుల్ రహీం, సంతోష్, పిడి సట్ల శంకర్, పిఈటి యాదగిరి, హౌస్ మాస్టర్ మేక సురేందర్, కోసరి మహేష్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ బి.బాబురావు, కళాశాల అధ్యాపక బృందం ప్రత్యేకంగా అభినందించారు.