నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని సోఫీ నగర్ గురుకుల పాఠశాల చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి ఫిజికల్ సైన్స్ టాలెంట్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ డానియల్ తెలిపారు. పాఠశాలకు చెందిన వర్షిని మరో జిల్లా స్థాయిలో బుధవారం నిర్వహించిన పోటీ పరీక్షలో ఎంపిక కావడంతో రాష్ట్రస్థాయిలో ఈనెల 12న పాల్గొనున్నట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను పరీక్షల సహాయ కమిషనర్ పద్మ జిల్లా సైన్స్ అధికారి వినోద్ పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.