calender_icon.png 19 October, 2024 | 5:11 PM

సింగ్ కోసం కొండగట్టుకు విద్యార్థి జేఏసీ పాదయాత్ర

19-10-2024 02:41:10 PM

కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ వేంకటేశ్వర స్వామి ఆలయం నుండి కొండగట్టు అంజనేయ స్వామి  ఆలయం వరకు శాతవాహన స్టూడెంట్ జేఏసీ వ్యవస్థాపక చైర్మన్ చెన్నమల్ల చైతన్య ఆధ్వర్యంలో పాదయాత్ర చేయడం జరిగింది. ఈ పాదయాత్ర ను వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, తెలంగాణ ఉద్యమకారుడు కెమసారం తిరుపతి, సర్దార్ సోహాన్ సింగ్ లు  పూలమాలలు వేసి ప్రారంబించారు.

ఈ సందర్భంగా చెన్నమల్ల చైతన్య మాట్లాడుతూ.. ఎమ్మెల్సీగా సర్దార్ రవీందర్ సింగ్ గెలుపుకొసం  తెలంగాణ లోని నాలుగు యూనివర్సిటీల విద్యార్థులు ఈ పాదయాత్ర చేపట్టినట్టు తెలిపారు. కాంగ్రేస్ ప్రభుత్వం అన్ని ప్రజా వ్యతిరేక విధానలతో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ని నెరవేర్వడం లేదని అలంటి సమయంలో ఇప్పుడు ఈ పట్టభద్రులు నియోజకవర్గం నుండి ప్రశ్నించే గొంతుకగా సర్దార్ రవీందర్ సింగ్ గెలిపించుకుంటే ప్రతిపక్ష పార్టీ సభ్యుడిగా ప్రభుత్వంతో నిరుద్యోగుల, పట్టభద్రులు సమస్యల మీద  పోరాటం చేస్తాడని  అన్నారు.