calender_icon.png 25 September, 2024 | 1:57 PM

విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి

25-09-2024 02:32:30 AM

మేడ్చల్, సెప్టెంబర్ 24: విద్యుదాఘాతంతో డిగ్రీ విద్యార్థి మృతి చెందిన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నూతన్‌కల్ గ్రామానికి చెందిన తాళ్లపల్లి సురేష్ గుప్తా, సరిత దంపతుల పెద్ద కుమారుడు తాళ్లపల్లి వినీత్ (18) కొంపల్లిలోని శివశివాని కళాశాలలో బీబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు.

మంగళవారం వినీత్ తమ ఇంట్లోని మొదటి అంతస్తు బాల్కానీ నుంచి ఇనుపరాడ్ కిందకు తీసుకవస్తున్న క్రమంలో పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్ వైర్లకు తాకడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు వినీత ణు మేడ్చల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందు తూ వినీత్ మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.