calender_icon.png 25 October, 2024 | 9:55 AM

టీజీఎస్ డబ్ల్యూ ఆర్డీసీ డబ్ల్యూలో స్టూడెంట్ కౌన్సిల్ ఎలక్షన్స్

29-08-2024 05:25:06 PM

మంచిర్యాల, (విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలోని తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల (టీజీఎస్ డబ్ల్యూఆర్డిసీడబ్ల్యూ)లో గురువారం స్టూడెంట్ కౌన్సిల్ ఎలక్షన్స్ నిర్వహించారు. ఎన్నికలలో 366 మంది విద్యార్థులు పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ డాక్టర్ పాండురంగ శర్మ, వైస్ ప్రిన్సిపల్ పత్తి సునీతలు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.