12-03-2025 12:00:00 AM
కామారెడ్డి, మార్చి 11 (విజయక్రాంతి): ఇటీవల దుబాయిలో న్యూజిలాండ్, ఇండియాతో జరిగిన ఛాంపియన్ ట్రోఫీ క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ సరిగా ఆడలేదని మనస్థాపం చెందిన పదో తరగతి చదివే క్రికెట్ ప్రేమికుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ సంఘటన కామారెడ్డి జిల్లా గర్గుల్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న పల్లపు శరత్ కుమార్ (16) అనే విద్యార్థికి క్రికెట్ మీద ఉన్న అభిమానంతో అతను ఇటీవల జిల్లా జట్టు తరఫున అండర్ 16 విభాగంలో హైదరాబాద్ లో జరిగిన క్రికెట్ మ్యాచ్లో కూడా ఆడి గెలుపొంది వచ్చినట్లుగా తెలిపారు.
కాగా కుటుం బీకులు మాత్రం శరత్ కుమార్ గత కొద్ది రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతుండేవాడని, ఆ బాధ భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య పాల్పడినట్లు ఫిర్యా దు చేసినట్లు దేవునిపల్లి ఎస్సు రాజు తెలిపారు.