calender_icon.png 23 February, 2025 | 3:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాల భవనంపై నుండి దూకి విద్యార్థి ఆత్మహత్య

22-02-2025 09:19:27 PM

ఉపాద్యాయుడు మండలించడంతో మనస్థాపం

న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, బంధువుల ధర్నా

మేడిపల్లి,(విజయక్రాంతి): పాఠశాల విద్యార్థి స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్(Boduppal Municipal Corporation) పరిధిలోని ద్వారకా నగర్ కు చెందిన ధర్మారెడ్డి, సంగీత దంపతుల రెండవ కుమారుడు సంగారెడ్డి ఉప్పల్ న్యూ భారత్ నగర్ లోని సాగర్ గ్రామర్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. శనివారం ఉదయం క్లాస్ రూమ్ లో పిటి ఆంజనేయులు విద్యార్థిని తీవ్రంగా మందలించడంతో  మనస్తాపానికి గురై వాష్ రూమ్ కి వెళ్లి వస్తానని చెప్పి బిల్డింగ్ నాలుగు అంతస్తుల పైనుంచి దూకి సంగారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే స్కూల్ కరస్పాండెంట్ చికిత్స నిమిత్తం దగ్గర లో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి విద్యార్థిని తరలించగా అప్పటికే చనిపోయాడని వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు స్కూలుకు చేరుకొని ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయుడి నిర్వాకం వల్లే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడని విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు, స్కూలు విద్యార్థులు పాఠశాల ముందు ధర్నాకు దిగారు. పోలీసులు ఘటనా స్థలానికి  చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.