calender_icon.png 28 September, 2024 | 2:53 PM

విద్యారంగ సమస్యలపై పోరాటం

28-09-2024 01:12:58 AM

పీడీఎస్‌యూ ఉపాధ్యక్షుడు నరేందర్ 

నిర్మల్, సెప్టెంబర్ 27(విజయక్రాంతి): రాష్ట్రంలో విద్యారంగం ఎదుర్కుంటున్న సమస్యలపై పీడీఎస్‌యూ రాజీలేని పోరాటాలు చేస్తున్నదని రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరేందర్ అన్నారు. నిర్మల్ పట్టణంలోని టీఎన్జీజీవో కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పీడీఎస్‌యూ 50 వసంతాల వేడుకల్లో ఆయన మాట్లాడారు. విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు.

విద్యరంగ పరిరక్షణకు విద్యార్థి సంఘాలు ఐక్యంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు విద్యార్థులతో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు నింది రామయ్య, రాజన్న, బొడ్డు లక్ష్మణ్, భూమేశ్, వెంకటస్వామి, లక్ష్మి పాల్గొన్నారు.